తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచుతుందా అంటే అవుననే అంటున్నారట విశ్లేషకులు.బండి సంజయ్ ఎంపిగా గెలిచినప్పటి నుండి తెలంగాణ బీజేపీ రాజకీయాల్లో మార్పులు కనిపిస్తున్నాయంటున్నారు.
దీనికి తగ్గట్టుగానే దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ కారుకు పంక్చర్ చేసిన బండి త్వరలో నాగార్జున సాగర్ లో జరగనున్న ఉప ఎన్నికల్లో కూడా తమ సత్తా చాటాలని ఆరాటపడుతున్నారట.
ఈ క్రమంలో ప్రస్తుతం కమల నాథులు సాగర్ పై ఫోకస్ పెట్టారట.
ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, సాగర్ ఉప ఎన్నిక విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ నెలలోనే నాగార్జున సాగర్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
కానీ నాగార్జున సాగర్ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదని పేర్కొన్నారు.
ఇక సాగర్ ఉప ఎన్నికలో గిరిజనులు టీఆర్ఎస్కు తగిన బుద్ధి చెబుతారంటూ విమర్శించారు.
దుబ్బాకలాగే సాగర్లో కూడా విసృతంగా ప్రచారం నిర్వహిస్తామని, ఈ ప్రచారంలో ముఖ్య నేతలందరం పాల్గొంటారని తెలియచేశారు.మరి చూడాలి రేసులో ఉన్న బండి హవా కారును ఓడిస్తుందో లేదో.