దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికలలో కమలం పార్టీ ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గం లో తప్ప మిగతా చోట్ల ఆశించిన స్థాయిలో రాణించలేక పోయింది.బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కూడా బీజేపీ ఓడిపోవడం… ఆ పార్టీకి ఇప్పుడు టెన్షన్ పుట్టించి నట్లయింది.
మొత్తం 23 అసెంబ్లీ స్థానాలకు 3 పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా.కాంగ్రెస్ కంటే తక్కువ స్థానాలను బిజెపి గెలుచుకోవడం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ 8 అసెంబ్లీ, ఒక లోక్సభస్థానాలు గెలుచుకోగా…బీజేపీ ఏడు అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానాలలో విజయం సాధించడం జరిగింది.
సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్రాలలో.అదే రీతిలో మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేసిన రాష్ట్రాలలో కూడా బిజెపి ఈ ఉప ఎన్నికలలో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి.ముఖ్యంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ వ్యూహాలకు బీజేపీ అతలాకుతలమైంది.
బెంగాల్ రాష్ట్రంలో జరిగిన 4 స్థానాల్లో బీజేపీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది.మూడు చోట్ల డిపాజిట్లు కోల్పోయింది.
హిమాచల్ ప్రదేశ్ లో పోటీ చేసిన అని స్థానాలలో బీజేపీ ఓడిపోయింది. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఇటువంటి తరుణంలో బీజేపీ ఈ ఉప ఎన్నికలలో… సరైన రీతిలో రాణించ లేని పరిస్థితుల్లో ఉండటంతో.బీజేపీ నాయకులు టెన్షన్ పడుతున్నారు.
మరోపక్క విపక్షాలు ఇదే సరైన సమయం అని.ఎలాగైనా బీజేపీని ఓడించాలని… వ్యూహాలు వేస్తున్నాయి.