కేంద్ర అధికార పార్టీ బీజేపీకి తిరుపతి టెన్షన్ బాగా పెరిగిపోతోంది.ఏపీలో బలంగా ఉన్న అధికార పార్టీ వైసీపీని ఢీకొట్టడం అంటే ఆషామాషీ విషయం కాదు అనే విషయం బీజేపీ నేతలకు బాగా తెలుసు.
కాకపోతే జనసేన పార్టీ మద్దతు తో తిరుపతి లో గెలవాలని చూస్తోంది.అందుకే కర్ణాటక చీఫ్ సెక్రటరీగా పనిచేసిన రత్నప్రభను బీజేపీలో చేర్చుకుని ఆమెను తిరుపతి లోక్ సభ అభ్యర్థిగా నిలబెట్టారు.
ప్రస్తుతం వాడివేడిగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.అలాగే రత్నప్రభ, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, దగ్గుబాటి పురంధరేశ్వరి , సునీల్ దియోధర్ మొదలైన వారంతా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలిసి మద్దతు ఇవ్వాలని , అలాగే తిరుపతి లోక్ సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించాలని కోరారు.
దీనికి పవన్ సైతం ఓకే చెప్పారు.
అయితే పవన్ బీజేపీ విషయంలో ఆగ్రహంగా ఉన్నారని, ఎట్టి పరిస్థితుల్లోను ఎన్నికల ప్రచారానికి వచ్చే అవకాశమే లేదని , పెద్ద ఎత్తున వార్తలు రావడంతో బిజెపి మరింత కంగారు పడుతోంది.
అయితే ఇదంతా నిజం కాదు అని, నా అభ్యర్ధిత్వంపై పవన్ కళ్యాణ్ 200 శాతం సంతృప్తిగా ఉన్నారని, ఎన్నికల ప్రచారానికి తప్పకుండా వస్తాను అని హామీ ఇచ్చారని , రత్నప్రభ చెబుతున్న పవన్ రావడంపై బీజేపీకి ఇంకా అనుమానంగా నే వుంది.అందుకే పవన్ ను ప్రసన్నం చేసుకునేందుకు రకరకాలుగా బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.
పవన్ ను ఏదో రకంగా ఎన్నికల ప్రచారానికి తీసుకువచ్చి, తమకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది.కానీ పవన్ వైఖరి టెన్షన్ పెట్టిస్తోంది.
ఏదో మొహమాటంగా ఆయన ప్రచారం చేస్తానని బీజేపీ నాయకులు కలిసిన సందర్భంగా హామీ ఇచ్చారు తప్ప, తిరుపతి ఎన్నికల విషయంలో జనసేన సీరియస్ గా ఉన్నట్టు కనిపించకపోవడం, చాలా కాలంగా బీజేపీ విషయంలో పవన్ ఆగ్రహంగా ఉండడం , ఒక దశలో ఆ పార్టీతో పొత్తు రద్దు చేసుకునే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం , ఇలా ఎన్నో అంశాలు బీజేపీకి టెన్షన్ కు పుట్టిస్తున్నాయి.అందుకే ఏపీ బీజేపీ నేతలు బీజేపీ జనసేన మధ్య ఎటువంటి విభేదాలు లేవని, రెండు పార్టీల మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయని, ఖచ్చితంగా ఎన్నికల ప్రచారానికి వస్తారని, రత్నప్రభ ఖచ్చితంగా జనసేన సహకారంతో గెలిచి తీరుతాను అని రత్న ప్రభ పదే పదే ప్రకటనలు చేస్తున్నారు.