మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని నిన్న 38వ పుట్టినరోజును జరుపుకున్న సంగతి తెలిసిందే.వరల్డ్ కప్ మొదలైనప్పటి నుంచి ధోని రిటైర్మెంట్ పై అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే ధోని క్రికెట్ కు ఎండ్ కార్డ్ పెట్టిన తరువాత ఎటువైపు అడుగులు వేస్తారు అనేది ఇప్పుడు అందరిలో చర్చనీయాంశంగా మారింది.
కోచ్ గా వెళతాడా.లేక సొంతంగా బిజినెస్ లతో కొనసాగుతాడా అనేది నిన్నటివరకు చర్చల్లోకి వచ్చింది.కానీ ఇప్పుడు ధోని మైండ్ పాలిటిక్స్ పై పడినట్లు కూడా టాక్ వస్తోంది.
బీజేపీ ధోనిని తమ వైపుకు మళ్లించేందుకు పావులు కదుపుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.ధోని సొంత రాష్ట్రమైన జార్ఖండ్ లోనే ధోని రాజకీయ అడుగులు మొదలవనున్నాయని తెలుస్తోంది.
మరికొన్ని రోజుల్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ధోని పోటీ చేయడానికి ఇష్టపడకపోయినా కనీసం ప్రచారాలకోసమైన వాడుకోవాలని చూస్తున్నారట.అయితే ధోని ఖచ్చితంగా పాలిటిక్స్ లోకి వెళతాడా అనేది అంతు చిక్కని విషయం.చాలా వరకు ధోని సన్నిహితులు అతను పాలిటిక్స్ లోకి వెళ్లే అవకాశం లేదని పలుమార్లు తెలిపారు.
కానీ బీజేపీ టార్గెట్ చేస్తే గౌతమ్ గంబీర్ లా ధోనిని సైతం దేశ రాజకీయాల్లో కీలకంగా మార్చే అవకాశం ఉందని టాక్ వస్తోంది.ఈ విషయంపై ఒక క్లారిటీ రావాలంటే ధోని రిటైర్మెంట్ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.