కడప ప్రజలకి హత్య రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేదని నిన్న తాను ప్రెస్ మీట్లో చెప్పిన భావాన్ని కొంతమంది వక్రీకరించారని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు.ప్రముఖులు మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుని దృష్టిలో పెట్టుకుని మాత్రమే తాను మాట్లాడి నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఆయన హత్యలో కొంత మంది రాజకీయ నాయకులు ఉన్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలోనే మాట్లాడానన్నారు.కడప ప్రజలకి ఈ హత్య రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు అని తెలియజేసారు.