తిరుపతి పార్లమెంటు స్థానానికి వచ్చే ఏడాది మార్చిమొదటివారంలో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది.అయితే.
రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పడినతర్వాత జరుగుతున్న ఏకైక ఎన్నిక ఇదే కావడం.పైగా అధికార పార్టీ ఎంపీ స్థానం కావడంతో దీనిని ప్రాదాన్యం ఏర్పడింది.
గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి గెలిచిన బల్లిదుర్గా ప్రసాద్ మృతి చెందారు.దీంతో ఇక్కడ ఉప పోరు జరగనుంది.
వాస్తవానికి ఇలాంటి ఎన్నికలకు ఇతర పార్టీలు దూరంగా ఉంటాయి.కానీ, ఇటీవల ఈ సంప్రదాయాన్ని రాజకీయ పక్షాలు వదులుకున్నాయి.
ఈ క్రమంలో ఇప్పుడు అన్ని పార్టీలూ దీనిపై దృష్టి పెట్టాయి.
మరీ ముఖ్యంగా ముందే కూసిన కోయిల మాదిరిగా.
బీజేపీ ఇక్కడ పాగా వేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.ఇక్కడ బలాబలాలపై చర్చించేందుకు జాతీయస్థాయి నాయకులు భేటీ అవుతున్నారు.
ఈక్రమంలో బీజేపీ పాగా వేస్తుందా? బలమైన వైసీపీ ఓటు బ్యాంకును ఢీ కొడుతుందా? అనేది చర్చనీయాంశంగామారింది.ఇక్కడ మొత్తం ఏడు అసెంబ్లీ స్తానాలు ఉన్నాయి.
సర్వేపల్లి, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి నెల్లూరు జిల్లాల పరిదిలో ఉన్నాయి.తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడులు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి.
దీంతో ఇక్కడ ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ ప్రభావం పై అంచనా వేయనున్నారు.
వాస్తవానికి ఆయా నియోజకవర్గాల్లో గత ఏడాది ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది.బలమైన నాయకులు ఇక్కడ ఉన్నారు.వీరికి బాధ్యతలు అప్పగించే యోచనలో జగన్ ఉన్నారు.అదేసమయంలో తిరుపతిని గ్రేటర్ నగరంగా ప్రకటించే ప్రతిపాదనను ఎన్నికలకు ముందు ఆయన తీసుకురానున్న విషయంపైనా బీజేపీ ఆలోచిస్తోంది.అయితే.జనసేన బలంతో ఇక్కడ పుంజుకునే అవకాశం ఉందని, సంస్థాగతంగా భానుప్రకాశ్ తదితర నాయకులు కూడా బీజేపీకి బలంగా ఉండడం, తిరుమలలో జరుగుతున్న హిందూ వ్యతిరేక కార్యక్రమాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని… ఈ ప్లాన్తోనే వైసీపీని దెబ్బ కొట్టాలని బీజేపీ నేతలుప్లాన్ చేసుకుంటున్నారు.
ఇక, వ్యూహాత్మకంగా .టీడీపీని ఇక్కడ పోటీ నుంచితప్పించే ప్రయోగానికి కూడా బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.గత ఎన్నికల్లో బీజేపీని కాదనుకున్నందునే తాము అధికారంలోకి రాలేక పోయామని.టీడీపీ అంచనాలు వేసుకోవడం.వచ్చే ఎన్నికల నాటికి కుదిరితే.బీజేపీతో పొత్తుకు రెడీ అవుతున్న నేపథ్యంలో.
ఈ సీటును త్యాగం చేసేందుకు చంద్రబాబు.ముందుకు వచ్చే అవకాశం స్పస్టంగా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఏపీలో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.మరి ఏం జరుగుతుందో చూడాలి.
దుబ్బాకలో సాధించిన విజయంతో మంచి జోష్ మీదున్న బీజేపీ.ఎలా ముందుకు వెళ్తుందో ? చూడాలి.