తెలంగాణ ఉద్యోగుల బదిలీల విషయంలో విడుదల చేసిన జీవో 317 పై రగడ అనేది కొనసాగుతూనే ఉంది.ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు తాము ఎంచుకున్న స్థానాల్లో బదిలీలపై ఈ రగడ అనేది ప్రారంభమైన విషయం తెలిసిందే.
అయితే ఆ తరువాత బీజేపీ ఈ అంశంలో జోక్యం చేసుకోవడంతో ఇక మరింతగా రాజకీయ మలుపు తిరిగిందని చెప్పవచ్చు.అయితే జీవో 317 కు వ్యతిరేకంగా బండి సంజయ్ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.
ఆ తరువాత అరెస్ట్ చేయటం లాంటి ఘటనలు మనం చూసాం.అయితే అయితే గత కొద్ది రోజులుగా విషయం సద్దుమణిగింది అనుకున్న తరువాత మరల వేములవాడ పర్యటనలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో మరల ఈ అంశం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఇంకా వరంగల్ లాంటి పట్టణాలలో ఇంకా కొద్ది మంది ఉపాధ్యాయులు ధర్నాలు, నిరసనలు చేస్తున్నా మెజారిటీ ఉద్యోగులు విధుల్లో చేరడంతో ప్రభుత్వం ఇక ఆ అంశాన్ని తేలికగా తీసుకున్న పరిస్థితి ఉంది.అయితే ఈ నిరసనలు జరుగుతూ ఉన్న సమయంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ చెల్లింపుతో ఒక్కసారిగా ఉద్యోగులు ఆగ్రహం చల్లబడింది అని చెప్పవచ్చు.
అయినా బీజేపీ ఈ అంశాన్ని ఇంకా వదిలే పరిస్థితి కనిపించడం లేదు.
ఎందుకంటే ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల చేసే వరకు ఇక వేరే అంశం ఏది కూడా ప్రతిపక్షాలకు లేని పరిస్థితుల్లో ఇదే అంశాన్ని కొనసాగించే అవకాశం ఉంది.అయితే ఇక ఈ అంశంపై ఎంతగా పోరాటం చేసినా కనీసం స్పందించిన పరిస్థితి లేదు.అయితే బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన జీవో 317 సవరణ అంతా రాజకీయ ప్రయోజనం కోసమేనని కెసీఆర్ బలంగా విశ్వసించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.