ఇటీవల ముగిసిన గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల అనంతరం. ఓ చిత్రమైన కథ తెరమీదికి వచ్చిం ది.అక్కడి ఎన్నికల్లో బీజేపీ పుంజుకున్న విషయం తెలిసిందే.2016 నాటి గ్రేటర్ ఎన్నికల్లో కేవలం నాలు గు స్థానాలకే పరిమితమైన కమల నాథులు.ఇప్పుడు ఏకంగా 48 స్థానాలకు చేరుకున్నారు.అయితే ఇంతకన్నా ఎక్కువ స్థానాల్లోనే బీజేపీ గెలుపుగుర్రం ఎక్కి ఉండేదని టీఆర్ఎస్ కు లభించిన 55 స్థానాల్లోనూ చాలా వరకు బీజేపీకి దక్కి ఉండేవని అయితే టీఆర్ ఎస్కు వెనుక ఏపీ అధికార పార్టీ వైసీపీ ఉందని పేర్కొంటూ కొన్ని విశ్లేషణలు వచ్చాయి.
దీంతో ఈ విషయం ఆసక్తిగా మారింది.టీఆర్ఎస్కు మద్దతుగా వైసీపీ తన నేతలను, అదేసమయంలో ఏపీ నుంచి తన కనుసైగలతో జగన్ కూడా తెలంగాణలోని సెటిటర్లను కదిలించారని.
ఈ కారణంగానే టీఆర్ ఎస్ ఆ స్థానాల్లో గెలిచి బీజేపీ గెలుపు అవకాశాలు దెబ్బతిన్నాయని.అంటే.
పరోక్షంగా బీజేపీ గ్రేట ర్ పీఠాన్ని దక్కించుకోక పోవడానికి జగనే కారణమంటూ ఈ విశ్లేషణ.సాగింది.
అంతేకాదు.ఈ పరిణామా లను సీరియస్గా తీసుకున్న బీజేపీ అధిష్టానం.
ఇక, రేపో మాపో జగన్పై అంతకు అంత కసి తీర్చేసుకోవడం ఖాయమని కూడా విశ్లేషణ చెప్పుకొచ్చింది.
మరి ఇదినిజమేనా? గ్రేటర్లో బీజేపీ ఓటమికి, అదేసమయంలో ఆ మాత్రమైనా టికెట్లు దక్కించుకున్న టీఆర్ ఎస్ గెలుపునకు ఎక్కడో ఏపీలో ఉన్న జగనే కారణమా? అనేది ఆసక్తికలిగిస్తున్న ప్రశ్న.వాస్తవానికి ఇదే నిజమైతే.జగనే స్వయంగా తన పార్టీని అక్కడ పోటీ చేయించి ఉండేవారని అంటున్నారు పరిశీలకు లు.ఇవన్నీ ఇలా ఉంటే.ఏపీకి బీజేపీ చేసిన ద్రోహం కారణంగానే తాము ఇబ్బందులు పడుతున్నామనే వారు కూడా హైదరాబాద్లో ఉన్నారు.
మరి వారే బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసి ఉండొచ్చు కదా? ఇక, కేసీఆర్పై ఆదిలో ఉన్న వ్యతిరేకత ఇప్పుడు సెటిలర్లలో ఎక్కడా కనిపించడం లేదు.
సో ఇదీ ఆయన పార్టీకి ఓట్లు వేయించేందుకు అవకాశంగా మారిందని.
అంతే తప్ప జగన్ కనుసైగలతో గ్రేటర్ ఎన్నికలను శాసించాడనే విశ్లేషణలు ఉత్తవేనని కొట్టి పారేస్తున్నారు పరిశీలకులు.పైగా ఆ మాత్రం తమ పరిస్థితిని అంచనా వేసుకోకుండానే బీజేపీ జాతీయ నేతలు రాజకీయ కక్ష తీర్చుకునేందుకు జగన్పై కత్తి ఎత్తుతారా? అని కూడా ప్రశ్నిస్తుండడం గమనార్హం.