తెలంగాణలో బీజేపీ భిన్నమైన వ్యూహాలతో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు కావాల్సిన బలాన్ని సిద్ధం చేసుకుంటోంది.ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ బలహీనంగా ఉండడంతో సాధ్యమైనంత తొందరగా రాష్ట్రంలో బలపడాలన్నది బీజేపీ ఆలోచనగా తెలుస్తోంది.
అయితే ఇప్పటివరకు ఒక పంథాను అవలంబించిన బీజేపీ ఇప్పుడు కొత్త తరహా రాజకీయానికి తెరదీస్తోంది.అయితే తాజాగా బండి సంజయ్, ఎంపీ అరవింద్ ప్రసంగిస్తున్న సమయంలో ఓ పిల్లవాడు వీరిరువురు మాట్లాడుతుంటే వాటికి తగ్గట్టు హావభావాలు ప్రదర్శిస్తున్న సమయంలో అక్కడ ఆ సమావేశానికి హాజరైన ఓ బీజేపీ నేత మొత్తం వీడియో తీయడంతో ఆ వీడియో వైరల్ గా మారింది.
అయితే ఆ పిల్లవాడిని పిలిపించుకొని మంచి స్కూల్ లో చదివిస్తానని ఎంపీ అరవింద్ మాట ఇవ్వడం, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంచి డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తామని చెప్పడం, అప్పటివరకు మీ ఇంటి కిరాయి బీజేపీ చెల్లిస్తుందని మాట ఇచ్చారు.అయితే ఇంత హడావిడిగా అతనిని ఎందుకు తెర మీదికి తీసుకవచ్చారనేది ఒక సారి మనం పరిశీలిస్తే కేసీఆర్ ప్రభుత్వంపై కొంత మందికి ఆగ్రహం ఉన్నా ఓటు సమయంలో చూపిద్దామని కొందరు ఆలోచిస్తారు.
కాని ఇతను బహిరంగంగా కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భంలో ఇతనిని బూచిగా చూపి ఎన్నికలలో చిన్న పిల్లాడిలో సైతం కేసీఆర్ పై ఇంత స్థాయిలో ఆగ్రహం ఉందంటే, ఇక ప్రజలకు ఎంత మేర ఆగ్రహం ఉందో అర్థం చూసుకోండి.అని కావున బీజేపీకి ఓటు వేసి ఆశీర్వదించాలనే ప్రచారాన్ని బలంగా తీసుకెళ్లే అవకాశం ఉంది.