బండి సంజయ్ పై బీజేపీలో తిరుగుబాటు...అసలు కారణమిదే...

తెలంగాణలో బీజేపీ అనే పార్టీ ఒకటి ఉందా అనేది రెండు సంవత్సరాల క్రితం ఎవరికి తెలియదు.అప్పటివరకు లక్ష్మణ్, కిషన్ రెడ్డి లాంటి నాయకులు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసినా బీజేపీకి ప్రజల్లో పెద్దగా ఆదరణ దక్కలేదు.

 Bjp Leaders Serious On Bandi Sanjay, Bandi Sanjay, Bjp Politics, Bjp Leaders, Tr-TeluguStop.com

అయితే బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తరువాత బీజేపీ ఒక్కసారిగా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది.అయితే అప్పటివరకు సౌమ్యంగా రాజకీయం చేసిన బీజేపీ… బండి సంజయ్ రాకతో బీజేపీ రాజకీయం పూర్తిగా మారిపోయింది.

అయితే బీజేపీ బలహీనంగా ఉన్న పరిస్థితులలో టీఆర్ఎస్ కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఉండేది.అయితే కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో టీఆర్ఎస్ పై బీజేపీ తీవ్ర విమర్శలు చేయడం వల్ల టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీజేపీ అవతరించింది.
అయితే ప్రస్తుతం బండి సంజయ్ పై బీజేపీలో తిరుగుబాటు ఏర్పడింది.ఒకప్పుడు వర్గాలకు బీజేపీలో స్థానం లేదు అయితే ఇప్పుడు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కు ప్రాధాన్యత తగ్గిందని భావిస్తున్న వారి వర్గాలు బండి సంజయ్ వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

అవసరమైతే పార్టీ సమావేశాల్లో ఈ విషయాన్ని తెరపైకి తెచ్చే అవకాశం ఉంది.ఇప్పుడే తన ప్రస్థానాన్ని ప్రారంభించిన బీజేపీ ఇక భవిష్యత్తులో వీటన్నింటిని తట్టుకొని ఎలా ముందుకెళ్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube