ఏపీపై బీజేపీ అనుసరిస్తున్న ధోరణి చిత్రంగా ఉందా? సీఎం జగన్ విషయంలో కమల నాథులు చేస్తున్న విన్యాసం విస్తు గొలుపుతోందా? అంటే.ఔననే అంటున్నారు పరిశీలకులు.
కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు.ఏపీ సర్కారును కొనియాడుతారు.
కరోనా పరీక్షల్లో ముందున్న రాష్ట్రంగా ప్రధాని నరేంద్ర మోడీ.ఇటీవలే కొనియాడారు.
అదే సమయంలో రాష్ట్రంలో చేపట్టిన సచివాలయ వ్యవస్థను కూడా కేంద్రంలోని పెద్దలు కొనియాడారు.అయితే, రాష్ట్రంలోని నాయకులు మాత్రం జగన్ సర్కారుపై ఏదో ఒకరూపంలో విమర్శలు చేయడం, ఎదురుదాడి చేయడం వంటివి ద్వంద్వ ప్రమాణాలుగా కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.
రాష్ట్రంలో బీజేపీ పుంజుకోవాలనేది వ్యూహమే.వచ్చే ఎన్నికల నాటికి .పార్టీ పుంచుకుని తీరాలని భావిస్తోంది.అయితే, దీనికి సంబంధించిన వ్యూహాల్లో కేవలం ప్రభుత్వంపై దాడి చేస్తే.సరిపోతుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.రాష్ట్రంలో ప్రజలను కలిసి.
దానికి తగిన విధంగా ప్రణాళిక వేసుకుని ముందుకు సాగాల్సిన బీజేపీ.దానికి భిన్నంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఒకరకంగా.రాష్ట్రంలోని బీజేపీ పెద్దలు మరోరకంగా వ్యవహరిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలతో బీజేపీకే నష్టమని అంటున్నారు పరిశీలకులు.కేంద్రంలో అయినా.
రాష్ట్రంలో అయినా.పార్టీకి ఉన్న సిద్ధాంతం, లైన్.
ఒకటే అయి ఉంటాయి.ఈ నేపథ్యంలో సదరు సిద్ధాంతాన్ని ప్రామాణికంగా తీసుకుని ముందుకు సాగాల్సిన బీజేపీ.
కేంద్రంలో అయితే,.ఒకలాగా.
రాష్ట్రంలో ఉంటే.మరోలాగా అంటే.
అంతిమంగా నష్టం తప్ప వచ్చేది ఏమీలేదని అంటున్నారు.
రాష్ట్రంలో ఎదిగేందుకు, పార్టీని పరుగులు పెట్టించేందుకు అనేక మార్గాలు ఉన్నాయని చెబుతున్నారు.
వాటిని వదిలేసి.కేవలం ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.
ముందుకు సాగుతాం.అంటే.
పార్టీ పరిస్థితి ఎప్పటికీ ఇంతే అనే వ్యాఖ్యలే వినిపిస్తుండడం గమనార్హం.