పశ్చిమబెంగాల్లో ఓటమితో ఆలోచనలో పడ్ద మోదీ సర్కార్ ఈ రాష్ట్రంలో గెలవాలనే పట్టుదలతో దాదాపు రెండేండ్ల కిందటి నుంచే ఎన్నికలకు సమాయత్తమైందట.అసలే కేంద్ర పెద్దలకు మమత బెనర్జికి ఏ విషయంలో కూడా పొత్తు కుదరదు.
పొయ్యిలో ఉప్పు వేస్తే ఎలా చిటపటలాడుతుందో వీరి మధ్య వైరం కూడా అలాగే ఉందని ప్రచారం.ఈ నేపధ్యంలో పశ్చిమబెంగాల్లో గెలుపు కోసం బీజేపీ సర్వశక్తులూ ఒడ్డింది.తమ వ్యూహంలో భాగంగా సీనియర్ నాయకులను రంగంలోకి దింపింది.ఇక్కడ జరిగిన సభల్లో ప్రధాని మోదీ 20 సభల్లో పాల్గొనగా, అమిత్షా 50 సభలకు హాజరయ్యారు.అయినప్పటికీ పార్టీ అనుకున్న ఫలితాలను సాధించలేకపోయింది.
ఇక దీనికి కారణాలు వెతుకుతున్న అధిష్టానం మమతను దీటుగా ఎదుర్కొనే సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడం, ఇతర పార్టీల నుంచి భారీగా వలసలను ప్రోత్సహించడం, కరోనా సెకండ్ వేవ్ను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం మొదలు అంశాలన్ని కూడా ఓటింగ్పై ప్రభావం చూపిందని అందువల్లే ఆశించిన స్దాయిలో విజయాన్ని అందుకోలేకపోయామనే భావనకు వచ్చిందట.
ఇక ప్రజలకు సరైన రీతిలో న్యాయం చేస్తే వారు మాత్రం అడగకున్నా ఓట్లు వేస్తారు.ఈ విషయాలను మరచి గెలుపు కోసం అడ్దదారుల్లో వెళ్లుతున్న పార్టీల ఆటలు ఎంతో కాలం సాగవని అనుకుంటున్నారట కొందరు ప్రజలు.