ఏపీ రాజకీయాలలో తమ ప్రస్తానం మొదలుపెట్టాలని జాతీయ పార్టీ బీజేపీ చాలా దృఢ నిచ్చయంతో ఉంది.దీనికోసం ప్రస్తుతం సభ్యత్వ నమోదు కార్యక్రమన్ని విస్తృతంగా నిర్వహిస్తున్న బీజేపీ పార్టీలో ప్రధాన నేతలు అందరూ ఏపీ మీద ద్రుష్టి పెట్టారు.
బీజేపీ సీనియర్ నేత రాం మాధవ్ అయితే ఏపీ మీద ప్రత్యేకంగా దృష్టి సారించి అన్ని పార్టీల నేతలని బీజేపీ వైపు తీసుకొచ్చి పార్టీ బలం పెంచే ప్రయత్నం చేస్తున్నారు.ఇంత కాలం ఉత్తరాది రాష్ట్రాల మీద శ్రద్ధ పెట్టిన బీజేపీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని అర్ధమవుతుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఏపీలో టీడీపీకి అండగా ఉన్న కమ్మ సామాజిక వర్గాన్ని బీజేపీ వైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు.టీడీపీతో ఇక భవిష్యత్తు ఉండదని చెబుతూ ఆ పార్టీ స్థానాన్ని తాను లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది.
దీనికోసం ఇప్పుడు బీజేపీ మెయిన్ టీం మరో ఎత్తుగడని ప్రయోగిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.బీజేపీలో ఏపీ నుంచి కీలక మహిళ నేతగా ఉన్న పురందేశ్వరిని ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా చేసి ఆమెని మెయిల్ లీడ్ లో ఉంచి ఆమె సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది.
బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా కూడా ఆమె పేరునే తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం ద్వారా ఎన్టీఆర్ ఫ్యామిలీకి మీద అభిమానంతో ఉన్న అందరూ బీజేపీ వైపు చూస్తారని అనుకుంటున్నట్లు రాజకీయ వర్గాలలో టాక్ వినిపిస్తుంది.ఒక వేళ అదే నిజం అయితే ఇక చంద్రబాబుకి అండగా ఉన్న నందమూరి ఫ్యామిలీ నుంచి కూడా బీజేపీకి సపోర్ట్ దొరికే అవకాశం ఉంటుందని చెప్పుకుంటున్నారు.
మరి అది ఎంత వరకు నిజం అవుతుంది అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది.