మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో ఇటీవల పర్యటన చేపట్టారు.ఈ క్రమంలో బిజెపి పార్టీ నాయకులు మంత్రి కేటీఆర్ పర్యటన ను అడ్డుకోవడం జరిగింది .
ఈ క్రమంలో బిజెపి కార్యకర్తలకు మరియు పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో.పరిస్థితి శృతిమించడంతో అదనపు బలగాలు దించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా రంగంలోకి దిగడంతో ఇరు పార్టీల మధ్య ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.
ముఖ్యంగా గత ఎన్నికలలో కేటీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా. మళ్లీ నియోజకవర్గంలో ఎలా అడుగుపెడతారు అన్నది బిజెపి వాదన.30 పడకల ఆసుపత్రిని ఇస్తానని హామీ ఇచ్చి మాట తప్పారని బిజెపి నిరసనకు దిగడంతో పరిస్థితి తోపులాటకు దారితీసింది ఉద్రిక్తత చోటు చేసుకుంది.ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న క్రమంలో పోలీసులు రంగంలో దిగి వారిని అదుపు చేయాలని ప్రయత్నించిన గాని ఎవరు ఆగలేదు.మరోపక్క కేటీఆర్ వేములవాడ సిరిసిల్ల నియోజకవర్గాలలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్సిని సందర్శించారు.
జిల్లాలో మహమ్మారిని ఎదుర్కోవడానికి వైద్య బృందం మరియు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ స్పష్టం చేశారు.
.