ఏపీలో నెలకొన్న ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకోవడంతో పాటు తీవ్రమైన ఆర్థిక సమస్యలతో అలమటిస్తున్నారు.దాంతో విపక్ష పార్టీలు ప్రభుత్వంకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమంను నిర్వహిస్తున్నారు.
ఇటీవలై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ నిర్వహించిన విషయం తెల్సిందే.ఇక ఈనెల 14వ తారీకున చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ భారీ దీక్షను నిర్వహించేందుకు సిద్దం అయ్యింది.
విపక్ష పార్టీల మద్దతును టీడీపీ నాయకులు కోరుతున్నారు.ఈసందర్బంగా బీజేపీని కూడా టీడీపీ నాయకులు దీక్షకు మద్దతు తెలపాలంటూ కోరగా అందుకు నో చెప్పినట్లుగా సమాచారం అందుతోంది.
టీడీపీతో కలిసి తాము ఉద్యమం చేపట్టబోమంటూ ఏపీ బీజేపీ ప్రకటించింది.తాము సొంతంగానే ఇసుక పోరాటం చేస్తామంటూ స్పష్టం చేశారట.మరో వైపు టీడీపీ దీక్షకు జనసేన పార్టీతో పాటు ఇతర విపక్ష పార్టీల మద్యతు దక్కింది.భారీ ఎత్తున నిర్వహించబోతున్న దీక్షతో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను చాటేందుకు బాబు ప్రయత్నిస్తున్నాడు.