చప్పట్లు,దీపాలు అయిపోయాయి, ఇప్పుడు మోడీజీ మరో కొత్త టాస్క్

గత నెలలో చప్పట్ల తో డాక్టర్ల కు కృతజ్ణతలు చెప్పాలి అని కోరిన ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 5 వ తేదీ అనగా నిన్న(ఆదివారం) రాత్రి 9 గంటల సమయంలో 9 నిమిషాల పాటు ఇంట్లో లైట్స్ ఆఫ్ చేసి బాల్కనీ లో గాని బయటగాని క్యాండిల్స్,దీపాలు,మొబైల్ లైట్స్ తో వెలుగులు నింపాలి అని కోరారు.అయితే మోడీజీ చెప్పినట్లు గానే వేల కోట్ల మంది ఆ పనులను చేసి చూపగా ఇప్పుడు తాజాగా ప్రధాని మోడీ మరో టాస్క్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.

 Narendra Modi New Task For Bjp Followers , Bjp, Narendra Modi, Feed The Need, Li-TeluguStop.com

అయితే ఈ టాస్క్ కేవలం పార్టీ శ్రేణులకు మాత్రమే నని తెలుస్తుంది.బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి మోడీ నూతన టాస్క్ ను ఇచ్చారు.

కార్యకర్తలు అంతా సోమవారం ఒక పూట భోజనం మానేయాలని సూచించారు.

ఇలా చేసి లాక్‌డౌన్ కారణంగా ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతున్న వారికి సంఘీభావం తెలపాలన్నారు.

పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.కార్యకర్తలకు శుభాకాంక్షలు చెబుతూ.

కరోనా మహమ్మారి ప్రభలిన సమయంలో పేద వారికి అండగా నిలవాలన్నారు.జెండా ఆవిష్కరణలో సామాజిక దూరం పాటించాలని సూచించారు.

లాక్‌డౌన్‌లో ఇబ్బందులను ఎదర్కొంటున్నవారికి బీజేపీ కార్యకర్తలు సాయం చేయాలని, ప్రతి కార్యకర్త ఆరుగురు పేదవారికి ఆహార పదార్థాలు అందేలా చూడాలని సూచించారు.‘ఫీడీ ద నీడ్‌’ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామి కావాలని మోడీ పిలుపునిచ్చారు.

అలానే రెండు సీట్ల నుంచి ఇంత విరాట్ రూపంగా పార్టీ ఎదగడానికి ఎందరో కార్యకర్తలు, నేతలు కృషి చేశారని, వారి కృషి వల్లే పార్టీ నేడు ఇంతగా ఎదిగిందని ఆయన కొనియాడారు.మరోపక్క పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా కార్యకర్తలు పేదవారికి సాయం చేయాలనీ కోరారు.

పేదవారికి మాస్కులు కూడా పంపిణి చేయాలంటూ ఆయన సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube