బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు.ఆమెపై ఎప్పుడూ విమర్శలు వస్తూనే ఉంటాయి.తాజాగా కూడా ఆమెపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.2008 సెప్టెంబర్లో మహారాష్ట్రలోని మాలేగావ్ ప్రాంతంలో జరిగిన పేలుళ్లలో ఎంపీ ప్రజ్ఞా నిందితురాలుగా ఉన్నారు.2008లో అరెస్టయిన ఆమె 2017లో అనారోగ్య కారణాలతో బెయిల్పై రిలీజ్ అయ్యారు.ఇక ఆ ఏడాది నుంచి తనకు ఆరోగ్యం బాగోలేదంటూ ఆమె కోర్టు విచారణలకు హాజరు కావడంలేదు.
కానీ ఆమె చెప్పినట్టుగా ఆమె అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు ఏమాత్రం కనిపించడం లేదు.
తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోనే అందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
ఇటీవల ఆమె మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని కాళీమాత దేవాలయంలో అమ్మవారి దర్శించుకున్నారు.తర్వాత స్థానిక క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆట ఆడారు.
ఈ దృశ్యాలను ఓ అజ్ఞాత వ్యక్తి వీడియో తీసి నెట్టింట షేర్ చేశాడు.అది కాస్తా వైరల్ కావడంతో చాలామంది నెటిజన్లు ఆమెను తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు.
భేషుగ్గా కబడ్డీ ఆడుతూ ఆరోగ్యం బాగోలేదని అబద్దాలు ఎందుకు ఆడుతున్నారని చాలామంది నిలదీస్తున్నారు.
ఈ వీడియో తనదాకా వచ్చేసరికి ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ చాలా వింతగా స్పందించారు.
తాను కబడ్డీ ఆడుతున్నప్పుడు వీడియో తీసిన వ్యక్తిపై ఆగ్రహం వెళ్లగక్కారు.అంతేకాదు అతడిని ఏకంగా రావణుడితోనే పోల్చి సంచలనం సృష్టించారు.తనని వీడియో తీసిన వ్యక్తికి సంస్కారం లేదని.ఆ వ్యక్తి ముసలి వయసులోనే కాదు వచ్చే జన్మలోనూ దారుణ పరిస్థితులను అనుభవిస్తాడని ఆమె శపించారు.అబద్దాలు చెప్పడమే కాక ఆ అబద్ధాన్ని బయట పెట్టిన వ్యక్తిని ప్రజ్ఞా శపించడమేంటని చాలామంది నోరెళ్లబెడుతారు.
కాళీమాత దేవాలయం సమీపంలో కబడ్డీ పోటీల కార్యక్రమం జరిగింది.
ఇందులో మహిళా ప్లేయర్లు పాల్గొన్నారు.అక్కడికి ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ రావడంతో ఆమెను కూడా కబడ్డీ ఆడాల్సిందిగా వారు కోరారు.
దీనితో సదరు ఎంపీ కబడ్డీ ఆడారు కానీ చివరికి విమర్శల పాలయ్యారు.