ఏపీ శాసనమండలి రద్దుకు అసెంబ్లీ తీర్మానం చేసిన విషయం తెల్సిందే.అయితే అసెంబ్లీ తీర్మానం చేసినంత మాత్రాన మండలి రద్దు అవ్వదు అంటూ మొదటి నుండి తెలుగు దేశం పార్టీ నాయకులు చెబుతూ వస్తున్నారు.
బీజేపీ అనుకూలంగా ఉంటేనే మండలి రద్దు అవుతుందని, మండలి రద్దుకు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంది అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా బీజేపీ ఎంపీ జీవీఎల్ మాట్లాడుతూ మండలి రద్దు విషయమై కేంద్రం ప్రత్యేకంగా ఎలాంటి స్టాండింగ్ను తీసుకోదు అని, తీర్మానంను కేంద్రం పరిశీలించి రాజ్యాంగంలో ఎలా ఉంటే అలానే నిర్ణయం తీసుకుంటుందని, ప్రత్యేకంగా రాజకీయ కారణాలతో త్వరగా మండలిని రద్దు చేయడం కాని, ఆలస్యం చేయడం కాని జరగదు అంటూ ఈ సందర్బంగా జీవీఎల్ ప్రకటించాడు.
దీంతో మండలి రద్దు త్వరలోనే అయ్యే అవకాశం ఉంది అంటూ రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది.