తెలంగాణ రాజకీయాల్లో షర్మిల కొత్త పార్టీకి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నట్లు తెలుగు రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా వైయస్సార్ మద్దతుదారులతో ఆత్మీయులతో వరుస భేటీలతో షర్మిల బిజీ బిజీగా గడుపుతున్నారు.
ఈ రోజు హైదరాబాదు మరియు రంగారెడ్డి జిల్లాలకు చెందిన వైసీపీ మద్దతుదారులతో భేటీ కావడం జరిగింది.త్వరలోనే మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వైసిపి ఆత్మీయులతో కూడా భేటీకి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇలాంటి తరుణంలో షర్మిల కొత్త పార్టీ అంటూ వస్తున్న వార్తలపై తెలంగాణ బిజెపి నాయకుడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక కామెంట్ చేశారు.షర్మిల కొత్త పార్టీ అంటూ తెలంగాణ రాజకీయాల్లో హడావిడి చేయడం టైం వేస్ట్ అంటూ సెటైర్లు వేశారు.తెలంగాణ ప్రజలకు కావాల్సింది రాజన్న రాజ్యం కాదని రామ రాజ్యం అంటూ పేర్కొన్నారు.ఇదిలా ఉంటే షర్మిల తన తో భేటీ అయిన ప్రతి ఒక్కరి కార్యకర్తకి ఫీడ్ బ్యాక్ పత్రాన్ని అందజేసి వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు.
ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో షర్మిల పార్టీకి సంబంధించి చాలామంది నేతలు స్పందించడంతో రాజకీయంగా ఆమె పేరు తెలంగాణ లో మారుమ్రోగుతోంది.
.