తమకు అవకాశం దొరికినప్పుడల్లా తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ మీద బిజెపి నాయకులు విమర్శలు చేస్తూనే ఉన్నారు.ఆ పార్టీని ప్రజల్లో పలుచన చేసి వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ చూస్తోంది.
ఈ మేరకు రాష్ట్ర బిజెపి నాయకులకు టిఆర్ఎస్ పై విమర్శలు చేసే విషయంలో పూర్తి స్వేచ్ఛనిచ్చారు.ఆ పార్టీని టార్గెట్ చేసుకుంటూ బిజెపి బలపడేలా చేయాలని హైకమాండ్ నుంచి మౌఖిక ఆదేశాలు ఎప్పుడో అందాయి.
తాజాగా పార్లమెంట్లో నామా నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఖండించారు.బాలానగర్ , హుస్సేన్ సాగర్ పెద్ద చెరువులు పూర్తిగా కాలుష్యంతో నిండిపోయాయి అయినా నామ అబద్ధాలు చెబుతున్నారని అరవింద్ విమర్శించారు.
తెలంగాణలో కోతుల సంరక్షణ కోసం ఎటువంటి పార్కులు నిర్మించ లేదని, ఒకవేళ కెసిఆర్ ఫామ్ హౌస్ ను చూసి కోతుల పార్క్ అని అని నామా భ్రమపడి ఉంటారని అరవింద్ విమర్శించారు.నాయకులు వాస్తవాలు మాట్లాడాలని అలా కాకుండా తమ వ్యాపార అవసరాలు కోసం బజన చేయడం సరికాదంటూ అరవింద్ విమర్శలు చేశారు.