రాజాసింగ్ కొత్త వాదన! హిందువులని టార్గెట్ ఫుడ్ లో కెమికల్స్

తెలంగాణలో వివాదాస్పద నేతగా ముద్ర పడ్డ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.కరుడుగట్టిన హిందుత్వ వాదిగా ముద్ర వేసుకున్న అతను హిందువులపై జరిగే దాడులని, అలాగే హిందూ దేవతలకి వ్యతిరేకంగా ఎవరైనా వాఖ్యలు చేస్తే వెంటనే రియాక్ట్ అవుతారు.

 Bjp Mla Rajasingh Controversial Comments On Online Food Products-TeluguStop.com

తాజాగా అతను మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

హిందువుల సంతతి పెరగకుండా ఇతర దేశాలకి, మతాలకి చెందిన వారి ఫుడ్ ప్రొడక్ట్స్ లో కెమికల్స్‌ కలిపెస్తున్నారని, వీటిని తినడం వలెనే చాలా మంది పిల్లలు పుట్టకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.ప్రతి రాష్ట్రంలోనూ హిందువులని లక్ష్యంగా చేసుకొని ఏదో ఒక రూపంలో దాడులు జరుగుతున్నారని అన్నారు.

ఇండియా నుంచి హిందువులని లేకుండా చేయడమే లక్ష్యంగా ఘోరాలు చేస్తున్నారని అన్నారు.అందుకే ప్రతి హిందూ యువకుడు ఒక ఛత్రపతి శివాజీ కావాలని పిలుపునిచ్చారు.

వికారాబాద్‌ జిల్లా తాండూరులో నిర్వహించిన ఛత్రపతి శివాజీ జయంతి శోభాయాత్రలో రాజాసింగ్‌ పాల్గొన్నారు.జంక్ ఫుడ్స్ తినడం వలన సంతాన సమస్య ఏర్పడుతుందని డాక్టర్లు కూడా చెబుతున్న నేపధ్యంలో రాజాసింగ్ అన్న ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube