భారతీయ జనతా పార్టీ నాయకుడు గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీ నాంపల్లి స్పెషల్ కోర్టు ఏడాదిపాటు జైలు శిక్ష విధించింది.సరిగ్గా అయిదు సంవత్సరాల క్రితం అనగా 2016 సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీ లో బీఫ్ ఫెస్టివల్ సమయంలో ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన కొంప ముంచాయి.
ఆ సమయంలో బొల్లారం పోలీస్ లు ఆయనను అదుపులోకి తీసుకున్న సమయంలో.పోలీస్ స్టేషన్ లోనే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై సెక్షన్ 295 ఏ కింద బొల్లారం పోలీసులు కేసు నమోదు చేశారు.
దీంతో సరిగ్గా ఐదు సంవత్సరాల తర్వాత నాంపల్లి కోర్టు ఈ ఘటనపై శుక్రవారం తీర్పు ప్రకటించింది.రాజా సింగ్ కి ఏడాదిపాటు జైలు శిక్ష విధించింది.ఇటువంటి తరుణంలో రాజాసింగ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయటంతో న్యాయస్థానం ఆయనకి బెయిల్ మంజూరు చేసింది.మరోపక్క రాజాసింగ్ ఈ కేసుపై హైకోర్టును ఆశ్రయిస్తామని, పోరాడతామని తెలిపారు.