ఏక్తాకపూర్ పై రాజాసింగ్ ఫైర్... పోలీసులకి ఫిర్యాదు

బాలీవుడ్ లో ఎక్కువగా బోల్డ్ కంటెంట్ సినిమాలు తీసే మహిళా నిర్మాతగా ఏక్తా కపూర్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది.బాలాజీ టెలిఫిలింస్ అధినేత్రి ఏక్తా కపూర్ అక్కడ తిరుగులేని ఇమేజ్ ఉంది.

 Bjp Mla Raja Singh Complaint On Ekta Kapoor, Bollywood, Tollywood, Web Series, I-TeluguStop.com

ఇక సినిమాల నుంచి ఈ మధ్య వెబ్ సిరీస్ ల మీద దృష్టి పెట్టిన ఈమె.అక్కడ కూడా బోల్డ్, అడల్ట్ వెబ్ సిరీస్ లకే ప్రాధాన్యత ఇస్తుంది.ఇక డిజిటల్ ప్లాట్ ఫాంలో సెన్సార్ ఉండదు కాబట్టి మరింత బోల్డ్ కంటెంట్ తో వెబ్ సిరీస్ లని డిజైన్ చేస్తుంది.ఈ నేపధ్యంలో తాజాగా ఆమె అన్ సెన్సార్డ్ సీజన్-2 వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేసింది.

ఈ ట్రైలర్ పై ఎమ్మెల్యే రాజా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇందులో ఆర్మీ యూనిఫామ్ ను కించపరిచే సన్నివేశాలు ఉండటమే ఆయన ఆగ్రహానికి కారణం.

ఇప్పటికే హైదరాబాదుకు చెందిన విశాల్ కుమార్ అనే యువకుడు ఈ అంశంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఆర్మీ యూనిఫామ్ ను కించపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఏక్తా కపూర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ను కలిసి ఏక్తాపై ఫిర్యాదు చేశారు.

ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ సందర్భంగా మీడియాతో రాజాసింగ్ మాట్లాడుతూ, సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ట్రైలర్ ఉందని వ్యాఖ్యానించారు.

ఏక్తా కపూర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube