కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.దమ్ముంటే పార్టీ మారిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.
బై ఎలక్షన్ రావాలంటే దమ్ముండాలన్న ఆయన.రాజగోపాల్ రెడ్డికి ఆ దమ్ము ఉందని వ్యాఖ్యనించారు.
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ శరవేగంగా దూసుకుపోతుందన్నారు.కావాలంటే నియోజకవర్గ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవాలని సూచించారు.
అదేవిధంగా ప్రస్తుతం రాజీనామాలు చేస్తున్న అందరి చూపు బీజేపీ వైపే ఉందని తెలిపారు.