ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఉన్నవారికి శిక్ష తప్పదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.ఇందులో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందో లేదో దర్యాప్తులో తేలుతుందన్నారు.
చట్టానికి ఎవరూ అతీతులు కాదన్న ఆయన తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని తెలిపారు.దోచుకోవడానికి కేసీఆర్ కుటుంబం ఢిల్లీపై పడిందని ఆరోపించారు.
కుట్రలకు కేరాఫ్ అడ్రస్ గా కేసీఆర్ ప్రభుత్వం మారిందని విమర్శించారు.టీఆర్ఎస్ ను మట్టి కరిపించే శక్తి బీజేపీకి మాత్రమే ఉందని ఈటల స్పష్టం చేశారు.