టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కేసీఆర్ పాలనను ప్రజలు తిరస్కరిస్తున్నారని విమర్శించారు.
ఇంకా పాలనపై ఆయనకు నమ్మకం ఉంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు దిగాలని సవాల్ విసిరారు.హుజూరాబాద్ లో ఎన్ని డబ్బులు ఖర్చు చేసినా గెలవలేకపోయామని గుర్తించి.
ప్రస్తుతం మునుగోడులో టీఆర్ఎస్ ను గెలిపిస్తేనే నిధులిస్తామని ప్రజలను బెదిరిస్తున్నారని ఆరోపించారు.అనంతరం పార్టీ చేరికలపై మాట్లాడిన ఈటల.
టీఆర్ఎస్ పాలన విధానం నచ్చకే బీజేపీలోకి చేరుతున్నారని తెలిపారు.