తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగర ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకుడు ఆకుల సత్యనారాయణ రాజకీయ వ్యూహం యూటర్న్ తీసుకుంటోందా? బీజేపీలో సీనియర్ అయిన ఆయనకు ప్రత్యేకంగా ఎలాంటి గుర్తింపూ లేకపోవడం, వస్తుందని అనుకున్న పదవి.రాకుండా పోవడం.
రాష్ట్రంలో పార్టీ బతికి బట్టకడుతుందన్న ధీమా లేకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో ఆకుల వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో ఎలాగూ బీజేపీ ఏపీలో బతికి బట్టక ట్టడం అనేది అంత ఈజీకాదనే విషయం అందరికీ తెలసిందే.
ముఖ్యంగా సోము వీర్రాజు వంటి కీలక నేతను పక్కన పెట్టి.కాంగ్రెస్ నుంచి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణను రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడంపనై ఆకుల సలసలా మసిలి పోతున్నారు.
పైకి మాత్రం కూల్గా ఉన్నప్పటికీ.ఆయన మాత్రం లోలోన రగిలిపోతున్నారని బీజేపీ సీనియర్లు చెబుతున్న మాట.ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో కొందరు బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది.ఈ వార్తలకు బలం చేకూర్చే విధంగా.ఒక ఆసక్తికర అంశం చోటుచేసుకుంది.రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనా రాయణ భార్య ఆకుల లక్ష్మీపద్మావతి.
పవన్ కళ్యాణ్ కి సంపూర్ణ మద్దతు పలికారు.ఉద్దానం బాధితుల కోసం పవన్ చేసిన దీక్షకు సంఘీభావంగా ఆమె కూడా ఒకరోజు దీక్ష చేశారు.
తాను ఎప్పట్నుంచో పవన్ అభిమానినని, ఆయన ఆశయాలు-ఆవేశాలు తనకు నచ్చుతాయని చెబుతోంది.ఉద్దానం కిడ్నీ బాధితుల పక్షాన పవన్ పోరాడుతున్న తీరు చూసి స్ఫూర్తి పొందానని చెప్పింది.
భర్త బీజేపీ ఎమ్మెల్యే అయినప్పటికీ.తనకు ఎటువంటి అడ్డూ చెప్పలేదని ఆమె స్పష్టం చేయడం గమనార్హం.
దీంతో విశ్లేషకుల ఊహాగానాలు పెరిగిపోయాయి.అవకాశమొస్తే.
భార్యా భర్తలిద్దరూ జనసేనలోకి జంప్ అయినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు.రాష్ట్రంలో బీజేపీకి ఎలాగూ బతికి బట్టకట్టడం సాధ్యమయ్యే పనికాదని, మరోపక్క టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న వ్యతిరేక ప్రచారం మరింత ముమ్మరంగా మారి.
పార్టీని మరింతగా ప్రజల్లో బద్నాం చేస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
దీనికితోడు బీజేపీలో సీనియర్లమైన తాము.
నిన్నగాక మొన్న వచ్చిన కాంగ్రెస్ నాయకుడి కింద పనిచేయాల్సి రావడం ఎందుకు ? అనే ధోరణిలోనూ ఆలోచిస్తున్నారట.మొత్తంగా రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆకుల సత్యనారాయణ త్వరలోనే పార్టీ మారేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని అంటున్నారు.
ఒకవేళ ఆయన బీజేపీలోనే ఉన్నా.తన భార్యను వేరే పార్టీలోకి పంపాలని ఆకుల భావిస్తున్నట్టు సమాచారం.
ఏదేమైనా.రాబోయే రోజుల్లో ఆకుల ఫ్యామిలీ నుంచి ఇద్దరు నాయకులు రంగంలోకి దిగనున్నారనేది వాస్తవం అంటున్నారు పరిశీలకులు.