తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని బిజెపి ప్రతినిధుల బృందం కలిసింది.రాష్ట్ర ప్రధాన ఎన్నిక అధికారిని కలిసిన నేతలు.
మునుగోడు ఉపఎన్నికను కేంద్ర బలగాల పర్యవేక్షణలో నిర్వహించాలని కోరారు.అదేవిధంగా బీజేపీ నేతలపై అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈసీకి వినతి పత్రం అందజేశారు.
ఉపఎన్నిక నేపథ్యంలో నగదు తరలించే వాహనాలపై దృష్టి సారించాలని కోరారు.ప్రజాస్వామ్య పద్ధతిలో నిష్పక్షపాతంగా మునుగోడు ఉప ఎన్నిక జరగాలని విన్నవించారు.