బీజేపీ నేత సత్యకుమార్ తన వాహనంపై మందడంలో జరిగిన రాళ్ల దాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ముందస్తు ప్రణాళికతోనే దాడి చేశారని ఆరోపించారు.
తమపై,తమ వాహనంపై దాడి చేస్తుంటే పోలీసులు వారికే సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు.దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు.
అయితే ఇలాంటి తాటాకు తప్పుళ్లకు భయపడేది లేదని చెప్పారు.మీది కడప అయితే మాది కూడా కడపే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో వైసీపీ అరాచకానికి అడ్డుకట్ట వేస్తామని వెల్లడించారు.