తెలంగాణలో వచ్చే ఎన్నికలతో ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ ఆ దిశగా గట్టి ప్రయత్నలే చేస్తోంది.విజయం కోసం పక్కా ప్రణాళికలతో వ్యూహరచన చేస్తున్నారు కమలనాథులు కమలనాథులు.
కేసిఆర్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతనే ఆయుధంగా ఉపయోగించి ప్రజా ఓటు బ్యాంకు కొల్లగొట్టాలనేది కాషాయ పార్టీ అంతిమ టార్గెట్.అందుకే కేసిఆర్ ను దెబ్బ తీసే ఈ చిన్న అవకాశాని కూడా వదలడం లేదు, ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారం, డిల్లీ లిక్కర్ స్కామ్, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన మోసాలు.
ఇలా కేసిఆర్ పై ప్రయోగించేందుకు అస్త్రశాస్త్రాలనే సిద్దం చేసుకుంది బీజేపీ అధిష్టానం.
అయితే బీజేపీ( BJP ) ఎన్ని రకాల విమర్శలు చేస్తున్న అనుకున్న స్థాయిలో కేసిఆర్ ను ఇరకాటంలో పెట్టకపోగా.ఇంకా బీజేపీ పైనే నెగిటివ్ ఇంపాక్ట్ పడుతోంది.దీనికి ఉదాహరణగా ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారాన్ని చెప్పుకొచ్చు.
ఈ వ్యవహారంలో కేసిఆర్ పై బురద చల్లే ప్రయత్నం చేసిన.వికటించి బండి సంజయ్ అరెస్ట్ కావల్సిన పరిస్థితి.
మరి ఈ రకంగా కేసిఆర్ ను ఇరకాటంలో పెట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న అవన్నీ బెడిసి కొడుతూనే ఉన్నాయి.దీనికి కారణం బీజేపీలో కేసిఆర్ కోవర్ట్ లు ఉండడమే అని కమలనాథులే ఒప్పుకుంటున్నారు.
ఆ మద్య బీజేపీ నేత ఈటెల రాజేంద్ర( Etela Rajendra ) మాట్లాడుతూ బీజేపీలో సిఎం కోవర్టులు ఉన్నారని చెప్పుకొచ్చారు.
అయితే ఆ వ్యాఖ్యలను బండి సంజయ్ ఖండించినప్పటికి.మళ్ళీ తాజాగా బీజేపీ కీలక నేత నందీశ్వర్ రెడ్డి( Nandishwar reddy ) కూడా ఇదే విధంగా వ్యాఖ్యానిచడం చర్చనీయాంశం అయింది.బీజేపీలో కేసిఆర్ ( CM KCR )కోవర్ట్ లు ఉన్న మాట వాస్తవమేనని, వారి పేర్లతో సహ అధిష్టానానికి ఫిర్యాదు చేశానని ఒక్కసారిగా బాంబు పేల్చారు నందీశ్వర్ రెడ్డి.
దీంతో ఎవరా కోవర్ట్ లు అనే చర్చ ఊపందుకుంది.కోవర్ట్ ల కారణంగా బీజేపీ ఎలాంటి వ్యూహరచన చేసిన వాటిని కేసిఆర్ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారనేది కొందరు చెబుతున్నా మాట.అయితే కాషాయ పెద్దలు ఈ కోవర్ట్ లపై సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉంది.మరి ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఉన్న బీజేపీ అధిష్టానం కోవర్ట్ ల విషయంలో ఎలా రియాక్క్త్ అవుతుందో చూడాలి.