తెలంగాణ రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నాయకులు జరపటం జరిగింది.ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో పాటు బిజెపి నాయకుడు లక్ష్మణ్ మరి కొంతమంది నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా బిజెపి నాయకులు లక్ష్మణ్ జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది.అనంతరం సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కెసిఆర్ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుతామని తెలిపారు.
ఇప్పుడు ఎందుకు.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదని ప్రశ్నించారు.అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు ఎమ్మెల్యేలను చీము నెత్తురు ఉంటే పార్టీ నుండి బయటకు వచ్చి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలని.
సంచలన వ్యాఖ్యలు చేశారు.అటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమకారులు సమాజం ఎంతో పోరాడి తెచ్చుకున్న రాష్ట్రం విషయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని.
టిఆర్ఎస్ ప్రభుత్వం లైట్ తీసుకోవటం.దారుణమని స్పష్టం చేశారు.
కెసిఆర్ ప్రభుత్వం నిజాం ప్రభుత్వాన్ని తలపిస్తోందని.బీజేపీ నేత లక్ష్మణ్ సీరియస్ కామెంట్ చేశారు.