రాజకీయాలు నేటి కాలంలో ప్రజల కోసం కాదు ఉన్నవి.పాలకుల ఎదుగుదల కోసం, వారి ఆస్తులు పెంచుకుంటూ, వాటిని కాపాడుకోవడం కోసం.
ప్రజల కోసం రాజకీయాల్లోకి వస్తున్నా అని చేప్పేవారు వారి గుండెల మీద చెయ్యి వేసుకుని ఇదే మాటను చెప్పమనండి ఒక్కరి పెదవి కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది.అందుకే రాజకీయాన్ని రంకుతనంతో పోల్చిన వారు కూడా ఉన్నారు.
ఇకపోతే రాజకీయాల్లో వలసలు సర్వసాధారణంగా చోటు చేసుకునే పనులు.ఈ క్రమంలోనే బీజేపీకి చెందిన రాష్ట్ర స్టడి సర్కిల్ కన్వీనర్ పాలది రాంమోహన్ తో సహా 150 మంది కార్యకర్తలు, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని వెల్లడిస్తూ పార్టీ మారారు.
ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను విమర్శిస్తూ టీఆర్ఎస్ పార్టీని ఆకాశానికి ఎత్తేసారు.
చూశారా రాజకీయ సిత్రాలు.అవకాశాల కోసం నేతలు ఆడుతున్న గారడీలు అందుకే ముందుగా ఓటర్లు గొర్రెలుగా బ్రతకడం మానుకుంటే గానీ రాజకీయ ప్రక్షాళన జరగదని కొందరు అనుకుంటున్నారట.