దేశంలో కరోనా విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే.ఊహించని రీతిలో కేసులు పెరిగిపోతున్నాయి.
పరిస్థితి చూస్తే మళ్ళీ చేయి దాటి పోయే విధంగా.ఉన్నట్లు కేసులు నమోదవుతున్నాయి.
ఏకంగా సెలబ్రిటీలు కూడా రెండు డోస్ వ్యాక్సిన్లు వేసుకున్నా గాని.కరోనా బారిన పడుతూ ఉన్నారు.
ఇప్పటికే మహేష్ బాబు..
బండ్ల గణేష్.ఇంకా చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు కరోనా బారిన పడగా.
ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు వివిధ పార్టీల నేతలు కేంద్రమంత్రులు.కరోనా బారిన పడుతున్నారు.
తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా కరోనా బారిన పడటం జరిగింది.ఆయన స్వల్ప లక్షణాలతో.బాధపడుతూ ఉండటంతో వెంటనే వైద్య పరీక్షలు చేయించుకో గా పాజిటివ్ రిపోర్ట్ రావడం జరిగింది.ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
అంత మాత్రమే కాక గత కొన్ని రోజులుగా తనను కలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కరోనా పరీక్షలు చేయించుకోవాలని.ఐసోలేషన్ లో ఉండాలని సూచించారు.
ప్రస్తుతం డాక్టర్ల సలహా మేరకు ఇంటి వద్దనే ఐసోలేషన్ లో.ఉన్నట్లు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు స్పష్టం చేశారు.