ఏపీ రాజకీయాలు మొన్నటి వరకూ ఒకెత్తు నిన్నటి వరకూ ఒకెత్తు లా మారిపోయాయి.బీజేపి , జగన్ , జనసేన కూటమి ఏపీలో సక్సెస్ అవుతుందని ఈ దెబ్బతో చంద్రబాబు దెబ్బకి కుదేలు అవుతాడు ఏపీలో తెలుగుదేశం పార్టీని సోది లోకి లేకుండా చేస్తామని చెప్పిన బీజేపి కి లగడపాటి రాజగోపాల్ సంస్థ ఆర్జీస్ ఫ్లాష్ టీం జరిపిన సర్వే ఫలితాలు చూసి దిమ్మతిరిగిపోయింది రాజగోపాల్ సర్వే అంటే రాజకీయపార్టీలలో చాలా నమ్మకం ఉంటుంది.
లగడపాటి సర్వే కి తిరిగు ఉండదు అని ఎన్నో సార్లు రుజువయ్యింది కూడా.అయితే ఇదే క్రమంలో బీజేపి ఎంపీ జీవీఎల్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
అయితే ఇప్పుడు ఈ సర్వే ప్రభావం పార్టీలపై పడకుండా చేసేందుకు బీజేపి నష్ట నివారణ చర్యలు చేపడుతోంది.అందుకే జీవీఎల్ నరసింహారావు రంగంలోకి దిగారు.ప్రెస్ మీట్ పెట్టారు ఒక్క శాతం ఓట్లు వచ్చినా సరే బీజేపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతుందని తేల్చి చెప్పారు.నేను చెప్పేది వాస్తవం ఒక్క సాటి ఓట్లు పోలినా సరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అని తెలిపారు…ఈ కుమ్మక్కు సర్వే చూసి సంతోష పడకండి వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలిచినా.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయబోరని హెచ్చరించారు.
అయితే ఇప్పుడు రాజకీయవర్గాలలో ఇదే కీలక అంశంగా మారిపోతోంది.
చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయబోరు అంటూ జీవీఎల్ చేసిన కామెంట్స్ ఆపరేషన్ గరుడ కి క్లైమాక్స్ ఏమోనన్న చర్చ ఇప్పుడు ఏపీ ప్రజల్లో జోరుగా జరుగుతోంది.ఇప్పుడు జీవీఎల్ దానికి మరో కోణం జోడించి.
ఏపీలో బీజేపీకి ఒక్క శాతం ఓట్లు వచ్చినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నట్లుగా చెప్పుకొచ్చారు…ఇప్పుడు ఈ అంశం ఇంకా సస్పెన్స్ రేపుతోంది.
ఒక పక్క చంద్రబాబు పై వ్యతిరేకత తీసుకు వచ్చే క్రమంలో రమణ దీక్షితులు మరియు మోత్కుపల్లి వంటి వారితో సంచలన కామెంట్స్ చేయించి చంద్రబాబు పై ప్రజలలో తీవ్రవ్యతిరేకత తీసుకురావాలని అనుకున్న బీజేపి వ్యూహాలు ఫలిస్తాయా.? ఆపరేషన్ గరుడ క్లైమాక్స్ గా చెప్పబడుతున్న అంశాలు అమలు చేసి చంద్రబాబు ని ఇరుకున పెడుతారా అనేది త్వరలో తేలిపోనుంది అంటున్నారు.అసలు ఒక్క శాతం ఓట్లు వస్తే.
ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారో అనేది మాత్రం ప్రస్తుతానికి మాత్రం సస్పెన్స్ గానే ఉంది.