మంత్రి కేటీఆర్ కు బీజేపీ నేత డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు.యాదాద్రి ఆలయం మీ నాన్న కట్టాడని భ్రమిస్తున్నావా అని నిలదీశారు.
ఓ రాష్ట్ర అధ్యక్షుడు గుడికి వెళ్తే సంప్రోక్షణ చేయాలని మాట్లాడతావా అని ప్రశ్నించారు.దేవుళ్లపై నమ్మకమే లేని నీకు ఆలయం గురించి మాట్లాడే హక్కు ఉందా అని డీకే అరుణ ప్రశ్నించారు.
అయితే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ప్రమాణం చేసేందుకు బండి సంజయ్ యాదాద్రి ఆలయానికి వెళ్లిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా తడి బట్టలతో ఆలయంలోకి వెళ్లిన బండి సంజయ్ లక్ష్మీ నరసింహా స్వామివారి పాదాల చెంత ప్రమాణం చేశారు.
దీనిపై మంత్రి కేటీఆర్ యాదాద్రి ఆలయంలో సంప్రోక్షణ చేయాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.