తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డ బీజేపీ నేత..!!

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం తారా స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఏపీ లో ప్రతిపక్షాలు ఇదంతా పొలిటికల్ డ్రామా అంటూ ఆరోపణలు చేస్తూ ఉన్నారు.

 Bjp Leader Angry Over Telangana Cm Kcr Vishnu Vardhan Reddy,kcr,latest Ap News,v-TeluguStop.com

ఇలాంటి తరుణంలో ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు.ఆంధ్ర రైతులకు అన్యాయం చేస్తూ వారి కడుపు కొడుతూ.

అన్యాయంగా నీళ్లను సముద్రంలోకి పంపించిన చరిత్ర మీకే దక్కుతుంది కేసిఆర్ దొరగారు అంటూ విమర్శల వర్షం కురిపించారు.అంత మాత్రమే కాక.‘పులిచింతలలో తెలంగాణ జెన్‌కో అసందర్భంగా, దౌర్జన్యంగా విద్యుత్ ఉత్పత్తి చేసిన కారణంగా 7,400 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తోంది.

Telugu Ap Bjp, Ap, Ap Tg Issuse, Cm Jagan, Vishnuvardhan-Latest News - Telugu

దీంతో ప్రకాశం బ్యారేజీ నుండి ఐదు గేట్ల ద్వారా 8,600 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేసారు.మరిన్ని గేట్లుఎత్తి వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వృధాగా పంపుతున్నారు’ అదే రీతిలో ‘కేసీఆర్ గారు మీరు చేసిన అన్యాయం ఆంధ్రా రైతుకు మాత్రమే కాదు.ఈ దేశ రైతులందరికి.

మీరు చరిత్రలో రైతు ద్రోహిగా మిగులుతారు.నేటి సమాజం హిట్లర్ ను చూడలేదు, హిట్లర్ రూపంలో ఉన్న కేసీఆర్ గారిని ప్రత్యక్షంగా తెలుగురాష్ట్రాల ప్రజలు చూస్తున్నారు’ అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

ఇంకా విష్ణువర్ధన్ రెడ్డి నేటి వివాదంపై స్పందిస్తూ ‘చరిత్ర ఎన్నటికీ మీ అనైతిక అహంకార, పిచ్చి చర్యలను మరచిపోదు.స్వార్థ రాజకీయాల కోసం మీరు చేస్తున్న దుర్మార్గాలకు, తెలంగాణ రైతులు సైతం బుద్ధి చెప్పే రోజు వస్తుంది’ అని సోషల్ మీడియా సాక్షిగా విమర్శల వర్షం కురిపించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube