బెంగాల్ రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా ఉంది.త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఈ రాష్ట్రంలో జరగనున్న నేపథ్యంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీల మధ్య హోరాహోరి వాతావరణం నెలకొంది.
ముఖ్యంగా గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా సత్తా చాటడంతో ఈ సారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో రాణించడానికి అనేక పావులు కదుపుతోంది.ఇదిలావుంటే ఇటీవల కొంతమంది దుండగులు బెంగాల్ లోని సిలిగురిలో సీఎం మమతా బెనర్జీ పోస్టర్ పై ఉమ్ము వేయడం జరిగింది.
ఈ క్రమంలో ఆ పోస్టర్ నీ చూసిన తృణమూల్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు పెద్దగా పట్టించుకోలేదు.ఇలాంటి తరుణంలో సిలిగురి జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్, లాయర్ అఖిల్ బిస్వాస్ .మమతా బెనర్జీ పోస్టర్ పై దుండగులు వేసిన ఉమ్మును ఆయనే స్వయంగా శుభ్రం చేయటం జరిగింది.ఇదే క్రమంలో ఇలాంటి చర్యలు ఖండిస్తున్నట్లు…, చూసి తాను తట్టుకోలేక తానే మమత పోస్టర్ ని శుభ్రం చేశానని బిజెపి నేత అఖిల్ బిస్వాస్ అన్నారు.
ఇదిలా ఉంటే వాళ్లే కావాలని చేసి మళ్లీ శుభ్రం చేస్తున్నారు, పొలిటికల్ మైలేజ్ కోసం తాపత్రయపడుతున్నారు అంటూ తాజా వీడియో పై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. బిజెపి ఎలాంటి డ్రామాలు వేసిన బెంగాల్ ప్రజలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని పేర్కొంటున్నారు.