బీజేపీ ప్రభుత్వంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు.తిరుపతి తుడా మైదానంలో ప్రారంభమైన సీపీఐ మొదటి జిల్లా మహసభల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.జాతీయ జెండాను అమ్మకానికి పెట్టిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కిందని ఎద్దేవా చేశారు.
ముందస్తు ప్రణాళిక లేకుండా చైనా నుంచి నాణ్యత లేని త్రివర్ణ పతకాలను దిగుమతి చేసుకుని చేనేత కార్మికుల పొట్ట కొట్టారని ఆరోపించారు.