చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే రోజా అడ్డాలో బీజేపీ సరికొత్త స్ట్రాటజీ వేయడానికి రెడీ అయ్యింది.చాలా వరకూ సినీ గ్లామర్ ఉన్నవాళ్లు తిరుపతి పరిసర ప్రాంతాల్లో రాజకీయాల్లో నెట్టుకు రావడం జరిగింది.
చిరంజీవి ఎన్టీఆర్ వంటి వాళ్ళు తిరుపతి నుండి పోటీ చేసి గెలిచిన సందర్భాలు ఉన్నాయి.దీంతో ఎంతో కొంత తిరుపతి పరిసర ప్రాంతాల్లో సినీ గ్లామర్ పనిచేసే ప్రభావం ఉండటంతో ఎమ్మెల్యే రోజా నియోజకవర్గమైన నగరిలో ఆమెకు పోటీగా సీనియర్ హీరోయిన్ వాణి విశ్వనాథ్ ని రంగంలోకి దింపే ఆలోచనలో ఏపీ బీజేపీ పెద్దలు ఉన్నట్లు టాక్ రాజకీయవర్గాలలో వినబడుతోంది.
2019 ఎన్నికల టైంలో టీడీపీ పార్టీలో వాణి విశ్వనాథ్ చేరుతారనే ప్రచారం జరిగింది.అంతేకాకుండా చంద్రబాబుతో కూడా ఆ టైం లో భేటీ అవ్వడం జరిగింది.
దీంతో రోజా పై పోటీ చేసే అవకాశం ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.అంతమాత్రమే కాకుండా రోజా వాణి విశ్వనాథ్ మధ్య మాటల తూటాలు కూడా పేలాయి.
కానీ ఆ సమయంలో గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుటుంబానికి చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వటంతో వాణి విశ్వనాథ్ టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యే ప్రయత్నాలు నుండి విరమించుకున్నారు.ఇదిలా ఉంటే త్వరలో తిరుపతి ఉప ఎన్నిక జరగనున్న గ్రామంలో నాడు టీడీపీ వేసిన ప్లాన్ ఏపీ బీజేపీ నేతలు వేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి.
దీంతో ఎమ్మెల్యే రోజా ఏ ప్రాంతంలో అయితే ప్రచారం చేస్తుందో.ఆ ప్రాంతంలో వాణి విశ్వనాథ్ ని రంగంలోకి దించే ఆలోచన ఏపీ బీజేపీ చేస్తున్నట్లు రాజకీయవర్గాల్లో టాక్.కాగా వాణి విశ్వనాథ్ కూడా వచ్చిన ఈ ఛాన్స్ అసలు వదులుకోకూడదని భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఎమ్మెల్యే రోజాకు మంచి ఫైట్ ఇవ్వటానికి తాను రెడీ అని ఇప్పటికే కమలనాథులకు వాణి విశ్వనాధ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఏపీ బీజేపీలో అంతర్గతంగా టాక్ వినబడుతోంది.
మరో పక్క ఈ విషయం తెలుసుకుని వైసిపి పార్టీ నేతలు సినీ గ్లామర్ వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని, వాణి విశ్వనాధ్ బీజేపీ లో చేరిక వార్త ని లైట్ తీసుకుంటున్నారట.మరి రోజా వర్సెస్ వాణి విశ్వనాథ్ మధ్య పొలిటికల్ గ్లామర్ షో ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.