తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వంపై రోజురోజుకు మాటలతూటాలు పేలుస్తూ బలంగా టీఆర్ఎస్ కు ధీటుగా పోటీ ఇస్తున్న పరిస్థితి.సహజంగానే బీజేపీకి దేశ వ్యాప్తంగా హిందుత్వ పార్టీ అని పేరు ఉందనే విషయం మనకు తెలిసిందే.
ఏకంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ పలు సందర్భాలలో ఎక్కువ శాతం జనాభా ఉన్న హిందువులకు మద్ధతిస్తే బీజేపీ హిందుత్వ పార్టీ అని మీరు అనుకుంటే మాది మతతత్వపార్టీ అని అన్న సందర్భాలు ఉన్నాయి.తెలంగాణలో అన్ని మతాల ప్రజలు ఒక్కరిగా కలిసుంటున్న పరిస్థితులలో ప్రజల్లో బీజేపీ హిందుత్వ భావజాలాన్ని నెలకొల్పితే ప్రజలకు ఇతర మతాలపైన ద్వేషభావం వచ్చే అవకాశం ఉంది.
తాజాగా అయోధ్య రామలయ నిర్మాణ విరాళాల కొరకు ఎవరు వాటికి వ్యతిరేకంగా మాట్లాడినా రాముణ్ణి అవమానం చేసినట్టు మాట్లాడుతున్నారు అని అలజడని సృష్టించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది.ఈ మొత్తం వ్యవహారాన్ని మనం చూస్తే భవిష్యత్తులో దేవుడి సెంటిమెంట్, హిందుత్వ ఎజెండాతోనే ముందుకెళ్ళే పరిస్థితి ఉంటే మత ఘర్షణలకు ఆజ్యం పోసినట్టే అవుతుంది.
చూద్దాం భవిష్యత్తులో కూడా బీజేపీ ఇలాంటి వైఖరి కొనసాగిస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది
.