ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరి కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారంలో ఉన్న బిజెపి పార్టీకి చెందిన చాలామంది నాయకులు అఖిలేష్ యాదవ్ పార్టీ ఎస్పి లోకి వరుసపెట్టి జంప్ అవుతున్నారు.
దీంతో ఎవరికి టిక్కెట్ ఇవ్వాలో అర్థం కాని పరిస్థితిలో ఎస్ పి పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.బీజేపీ కీలక నాయకులు మరియు ఎమ్మెల్యేలు… ఇటీవల అఖిలేష్ యాదవ్ పార్టీ లోకి వెళుతూ బీజేపీ బీసీ సామాజిక వర్గాలకు అన్యాయం చేస్తుందని తిట్టి పోస్తూ.
జంప్ అవుతున్నారు.
ఇటువంటి తరుణంలో అఖిలేష్ యాదవ్ కి ఊహించని రీతిలో బీజేపీ చెక్ పెట్టింది.
మేటర్ లోకి వెళ్తే అఖిలేష్ యాదవ్ తమ్ముడు భార్య అపర్ణ యాదవ్ నీ బీజేపీ పెద్దలు తమ పార్టీలో జాయిన్ చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.ఇదే క్రమంలో సమాజ్వాది పార్టీ లో బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆరోపణలు అపర్ణ యాదవ్ చేయడం యూపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
బీజేపీ నేతలు పార్టీని వీడి ఎటువంటి కామెంట్లు చేశారో… అదే కామెంట్లు అపర్ణ యాదవ్ ఎస్పి పార్టీపై చేయడంతో.ఉత్తర ప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి.
అపర్ణ యాదవ్ పార్టీ మారటంతో అఖిలేష్ యాదవ్ కి కొత్త తలనొప్పి స్టార్ట్ అయ్యాయి.గతంలో 2017 ఎన్నికల సమయంలో అపర్ణ యాదవ్ ఎమ్మెల్యేగా ఎస్పి పార్టీ తరఫున చేసి ఓడిపోవడం జరిగింది.ఈ తరుణంలో ఆమె బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడానికి ఏర్పాట్లూ చేసుకోవటం సంచలనంగా మారింది.