తెలంగాణ లిక్కర్ స్కాంపై సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.ఢిల్లీ లిక్కర్ పాలసీ తెలంగాణను పొలి ఉందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు.
రాష్ట్రంలో ఎనిమిదేళ్లలో రెండు సార్లు లిక్కర్ పాలసీ మార్చారని విమర్శించారు.తెలంగాణలో ధరలు పెరిగాక ఢిల్లీలో మద్యం ధరలు పెంచారన్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీకి తెలంగాణ లిక్కర్ పాలసీ ఆదర్శమైందని ఎద్దేవా చేశారు.కవిత మాట వినే వ్యక్తికే ఎక్సైజ్ శాఖను, చీఫ్ సెక్రటరీ మాటవినే వ్యక్తికే ఎక్సైజ్ కమిషనర్ బాధ్యతలు అప్పగించారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ ఎక్సైజ్ పాలసీపై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు.