ఏపీలో విపక్ష వైసీపీ అధినేత జగన్కు రాజకీయంగా రోజు రోజుకు మరింత డిఫెన్స్లోకి వెళ్లిపోతున్నాడు.తాజాగా ఏపీలో పోటీపెట్టిన మూడు స్థానిక సంస్థల నియోజకవర్గాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఘోరంగా ఓడిపోయారు.
కడపలో అయితే జగన్ బాబాయ్ వైఎస్.వివేక ఓడిపోవడం జగన్తో పాటు వైసీపీని మానసికంగా బాగా కుంగదీసింది.
ఈ క్రమంలోనే జగన్ 2019 ఎన్నికలకు ఒంటరిగా వెళ్లడం కంటే ఏదో ఒక జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే గత రెండు రోజులుగా వైసీపీని బీజేపీలో విలీనం చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి.
జగన్ అక్రమాస్తుల కేసుల నుంచి బయటపడాలంటే పార్టీని బీజేపీలో విలీనం చేయాలని బీజేపీ జాతీయ అధిష్టానం కండీషన్లు పెట్టినట్టు సమాచారం.ఈ వార్తలు ఏపీ రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు రేపాయి.
విలీనం వార్తలు వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు, క్యాడర్ను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి.
వచ్చే ఎన్నికల తర్వాత వైసీపీని బీజేపీలో విలీనం చేస్తామని జగన్ బీజేపీ అధిష్టానం వద్ద ప్రతిపాదన పెట్టినట్టు కూడా మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ సైతం జగన్కు బిగ్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది.వచ్చే ఎన్నికల్లో తమతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని యూపీఏ అధికారంలోకి వస్తే ప్రాధాన్యం ఉన్న కేబినెట్ పోస్టులు కూడా ఇస్తామని కాంగ్రెస్ జాతీయ నాయకత్వం వైసీపీ ఎంపీల ద్వారా జగన్ వద్దకు ప్రతిపాదనలు పంపిందట.
బీజేపీతో వెళితే ఉపయోగం లేదని, ఇప్పటి వరకు అండగా ఉన్న క్రైస్తవ, ముస్లిం ఓటర్లు వైసీపీకి దూరమవుతారని, కాంగ్రెస్తో కలిసి వెళితే తిరుగులేని విజయం సొంతమవుతుందని, రెండు పార్టీలకు ప్రయోజనం ఉంటుందని కాంగ్రెస్ జాతీయ నాయకులు జగన్కు చెపుతున్నారట.మరి జగన్ రూటు ఎలా ఉంటుందో చూడాలి.