వరంగల్ కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ల వద్ద బీజేపీ ఆందోళన..!!

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే.ప్రధాని మోడీ చేతుల మీదుగా ఉదయం పదకొండున్నర గంటలకు ప్రారంభమైన వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం మొట్టమొదట హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ అందించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

 Bjp At Warangal Covid Vaccine Centers, Bjp,corona Vaccine,warangal,telangana-TeluguStop.com

దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు వ్యాక్సిన్ వేస్తూ ఉన్నాయి.ఇలాంటి తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లా కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ల వద్ద బిజెపి పార్టీకి చెందిన కార్యకర్తలు భారీ స్థాయిలో ఆందోళన నిర్వహించారు.

కారణం ఏమిటంటే వ్యాక్సిన్ పంపిణీ బ్యానర్ పై మోడీ ఫోటో పెట్టలేదని.బిజెపి పార్టీకి చెందిన కార్యకర్తలు వ్యాక్సిన్ సెంటర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.అంతేకాకుండా మోడీ బొమ్మ లేని బ్యానర్ ని చించేశారు.ఎంజీఎం హాస్పిటల్, నర్సంపేట కోవిడ్ సెంటర్లో దగ్గర బిజెపి కార్యకర్తలు హల్ చల్ చేశారు.

కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు ఫోటోలు మాత్రమే ఉండటంతో బిజెపి నాయకులు సీరియస్ అయ్యారు.ఈ క్రమంలో హెల్త్ సూపర్డెంట్ నీ కూడా ప్రశ్నించడం జరిగింది.

సెంట్రల్ గవర్నమెంట్ లోగో ఉన్నాగాని కావాలని మోడీ ఫోటో పెట్టలేదని.బిజెపి నేతలు తెలంగాణ ప్రభుత్వం పై మండిపడుతున్నారు.

  

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube