ప్రస్తుతం ప్రపంచంలో కరోనా వైరస్ ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి అనేక దేశాల్లోని అనేక మంది శాస్త్రవేత్తలు రేయింబవళ్లు కష్టపడి కరోనాని ఎదురుకొనేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే కొంతమంది రాజకీయ నేతలు మాత్రం వారి నోటికొచ్చింది చెప్తూ… ప్రజలను అయోమయంలోకి పడేస్తున్నారు.ఎవరో చిన్న నేత ఇలాంటి కామెంట్ చేస్తే పెద్దగా పట్టించుకునేవారు కాదేమో.? కానీ, ఓ రాష్ట్రానికి పార్టీ అధ్యక్షత వహిస్తున్న వ్యక్తి ఇలా కామెంట్లు చేస్తే నిజమే అని చాలా మంది ప్రజలు నమ్మాల్సి వస్తోంది.
ఇకపోతే ఇప్పటికే చాలామంది నాయకులు పారాసెట్మాల్ టాబ్లెట్, వేపాకులు, వెల్లుల్లి, బ్లీచింగ్ పౌడర్ లాంటి వాటితో కరోనాను తరిమి కొట్టవచ్చునని చెప్పిన వారు ఉన్నారు.
అయితే ఇక తాజాగా మరో నేత ఆవు మూత్రం సేవిస్తే కరోనా రాదని ప్రచారం చేస్తున్నాడు.ఇకపోతే ఈ విషయాన్ని బెంగాల్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ అన్నారు.
భారతీయులందరూ ఎలాంటి టెన్షన్లు పడవద్దని మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి గోమూత్రం తాగితే సరిపోతుందని ఆయన తెలిపారు.
ఇంకేం మనం వ్యాక్షిన్ కోసం ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కదా.? అయితే, హిందూ సాంప్రదాయం ప్రకారం ఆవును పూజిస్తారు.అది అందరికీ తెలిసిన విషయమే.
దానికి ఎటువంటి అభ్యంతరం లేదు కూడా.అంత మాత్రాన కరోనా పోతుందని ఇలా చెప్పేస్తే… ప్రజలు ఇలాంటివి నమ్మి కరోనా జాగ్రత్తలు పాటించకపోతే దానికి ఎవరు బాధ్యత అని కొందరు వైద్యులు ప్రశ్నిస్తున్నారు.