మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడంపై విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఒక వైపు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు అక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తుండగా రాష్ట్రపతి పాలన విధించడం వెనుక రాజకీయ కారణం ఉందేమో అంటూ కాంగ్రెస్ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రపతి పాలన సమయంలో బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్యను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తుందేమో అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ నేపథ్యంలోనే హోం మంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడం పూర్తిగా గవర్నర్ నిర్ణయంపై ఆధారపడి ఉందని, ఆయన నిర్ణయం మేరకు రాష్ట్రపతి పాలన విధించినట్లుగా చెప్పాడు.అన్ని పార్టీలకు కూడా అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇచ్చాం.18 రోజుల పాటు అక్కడ ప్రభుత్వం ఏర్పాటుకు టైం ఇచ్చాం.కాని అక్కడ ప్రభుత్వ ఏర్పాటు కాకపోవడం వల్లే తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చిందంటూ ఈ సందర్బంగా అమిత్ షా అన్నాడు.
రాజ్యాంగంను కాలరాయలేదని, ఏ ఒక్కరి విజ్ఞప్తిని కాదని రాష్ట్రపతి పాలన విధించలేదంటూ ఆయన పేర్కొన్నాడు.