పదే పదే పార్టీలు, నియోజకవర్గాలు మారుతూ ఎప్పుడూ అధికారంలో ఉండే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఇప్పుడు తీవ్ర సంకట పరిస్థితి ఉంది.ఆయన వైసీపీలోకి వెళ్లేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆయన్ను పట్టించుకునే వారే లేరు.
ఆయన పార్టీ మారి మంత్రి అవ్వాలంటే ముందుగా ఎమ్మెల్యేగా పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లాలి.ఆ రిస్క్ గంటా చేయట్లేదు.
అయినా గంటాను పార్టీలో చేర్చుకునేందుకు ఎవ్వరూ ఒప్పుకోవడం లేదు. మంత్రి అవంతి అయితే గంటాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఇక టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ గంటా ఆ పార్టీ కార్యక్రమాలకు రావడం లేదు…నియోజకవర్గంలోనూ తిరగడం లేదు.ఇక గంటా బీజేపీలోకి వెళతారన్న ప్రచారం కూడా జరిగినా అది కాస్త సైలెంట్ అయ్యింది.
ఓవరాల్గా మాత్రం గంటా టెక్నికల్గా టీడీపీలో ఉన్నా మానసికంగా మాత్రం ఆ పార్టీలో ఉండేందుకు ఇష్టపడడం లేదు.ఇప్పటికే టీడీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి బయటకు వెళ్లిపోయారు.
గంటా కూడా పార్టీ మారేందుకు రెడీగా ఉన్నా సరైన టైం కోసం వెయిట్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే గంటా లాంటి బిగ్ షాట్ ను తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోందని తెలుస్తోంది.గంటా పార్టీలో చేరితే ఉత్తరాంధ్రలో బీజేపీ తిరుగులేని శక్తిగా మారతామని అంచనా వేస్తోంది.పైగా గంటాను పార్టీలో చేర్చుకుంటే ఉత్తరాంధ్రలో మెజార్టీ సంఖ్యలో ఉన్న కాపులు, తూర్పు కాపులను తమ వైపునకు తిప్పుకోవచ్చన్నదే బీజేపీ స్కెచ్.
ఈ క్రమంలోనే గంటాను పార్టీలో చేర్చుకుని అత్యంత ప్రతిష్టాత్మకమైన విశాఖ ఎంపీ సీటు ఇవ్వడంతో పాటు తాము గెలిపించుకుని కేంద్ర మంత్రిని చేస్తామని బిగ్ ఆఫర్ నే బీజేపీ ఇచ్చేసిందని ప్రచారం అయితే గట్టిగా విశాఖలో నడుస్తోంది.
దీనికి గంటా ఏమన్నారో తెలియదు కాని.
మాజీ జేడీ లక్ష్మీనారాయణ సైతం ఇదే సీటుపై కన్నేసిన సంగతి తెలిసిందే.ఆయన గత ఎన్నికల్లోనే జనసేన నుంచి పోటీ చేసి ఏకంగా 2.70 లక్షల ఓట్లు సాధించి.పరోక్షంగా టీడీపీ ఓటమికి కారణమయ్యారు.
మరి విశాఖ హాటు సీటు ఎవరికి దక్కుతుందో ? గంటా ఫ్యూచర్ ఎలా ఉంటుందో ? చూడాలి.