తెలంగాణలో బీజేపీ రోజు రోజుకు బలపడుతోంది. బండి సంజయ్ ఆధ్వర్యంలో దుబ్బాక ఉప ఎన్నికను ఎదుర్కొన్న బీజేపీ ఇప్పుడు మరో ఉప ఎన్నికను ఎదుర్కొబోతోంది.
అదే హుజూరాబాద్ ఉప ఎన్నిక.అయితే హుజూరాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ కంచుకోట అన్న విషయం మనకు తెలిసిందే అయితే హుజూరాబాద్ లో బీజేపీకి అంతగా బలం లేదు.
అయితే ఈటెలకు వ్యక్తిగతంగా ఉన్న ప్రతిష్టను ఉపయోగించుకొని గెలవాలని బీజేపీ యోచిస్తోంది.కాని ఇప్పటికిప్పుడు బీజేపీని బలపరచడం అంత ఈజీ కాదు.
ఎందుకంటే అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదని ప్రజలు బీజేపీ వైపు చూసే అవకాశం చాలా తక్కువ.అయితే ఈటెల ఆత్మగౌరవం దెబ్బ తినిందని ఆరోపిస్తున్న పరిస్థితులలో ప్రజలు మొత్తంగా బీజేపీ వైపు చూసే అవకాశం లేదు.
అయితే దుబ్బాక తరహా విజయం సంభవిస్తుందని చాలా మంది బీజేపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.కాని క్షేత్ర స్థాయిలో పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా లేవు.
ఎందుకంటే బీజేపీ అంటే చాలా మంది ప్రజలకు కనీసం అవగాహన లేదు.పార్టీ పేరు కొత్తగా ఉంటున్న వారే చాలా మంది ఉంటారు.ముందుగా ఇటువంటి అవరోధాలను దాటగలిగితేనే బీజేపీ సత్తా చాటే అవకాశం ఉంది.మరి బీజేపీ ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్తుందనేది చూడాల్సి ఉంది.