హుజూరాబాద్ గెలుపు ఈటలదే.. సర్వే రిపోర్ట్ లు వచ్చాయన్న బండి సంజయ్..!

తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈటల రాజేందర్ కలిసి బుధవారం కేంద్ర మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు.బీజేపీ తన ఫోకస్ మొత్తం హుజూరాబాద్ ఎలక్షన్స్ మీద పెట్టినట్టు తెలుస్తుంది.

 Bjp Bandi Sanjay With Media After Amit Shah Meeting, Bjp Bandi Sanjay,  Amit Sha-TeluguStop.com

దానికి సంబందించిన సర్వే నివేదికలు కూడా ఉప ఎన్నికల్లో గెలిచేది ఈటల రాజేందరే అని బండి సంజయ్ అన్నారు.అమిత్ షా తో 15 నిమిషాల పాటు మీటింగ్ జరిగింది.

ఆ తర్వాత బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.బీజేపీలో ఈటల రాజేందర్ చేరిన రోజే అమిత్ షాని కలవాల్సి ఉంది.

కాని అప్పుడు కొన్ని కారణాల వల్ల కుదరలేదు.అందుకే సమయం తీసుకుని వచ్చి కలిశామని అన్నారు.

ఇక జరుగబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచేది ఈటల రాజేందరే అని దానికి సంబందించిన సర్వే రిపోర్ట్స్ వచ్చయని అన్నారు బండి సంజయ్.

ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ ఏర్పాటు చేసే బహిరంగ సభకు అమిత్ షా వస్తారని తాను చేయనున్న పాదయాత్రకు ఆయన్ను ఆహ్వానించామని అన్నారు బండి సంజయ్.

ఆగష్టు 9న బండి సంజయ్ పాదయాత్ర మొదలవుతుందని అన్నారు.ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ సిద్దంగా ఉందని.

టీ.ఆర్.ఎస్ పార్టీనే భయపడుతుందని అన్నారు.వారికి హుజూరాబాద్ లో నిలబెట్టేందుకు అభ్యర్ధి కూడా దొరకట్లేదని ఎద్దేవా చేశారు.

డబ్బులు ఎంత పంచినా ప్రజల సొమ్మే కాబట్టి తీసుకుందాం కాని బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ ను గెలిపిద్దాం అని హుజూరాబాద్ ఓటర్లు అనుకుంటున్నారని అన్నారు బండి సంజయ్.టీ.ఆర్.ఎస్ చేస్తున్న అవినీతి, అక్రమాల, అరాచక పాలనను అంతం చేసేందుకే తను పాదయాత్ర చేస్తున్నానని చెప్పారు బండి సంజయ్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube