తెలంగాణ రాష్ట్ర రాజకీయల్లో ఇప్పుడొక నిశబ్దం ఎలాంటి హడావుడి లేకుండా తనపని తాను చేసుకు పోతుంది.అతడే టీఆర్ఎస్ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్.
ప్రస్తుతం తన రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా ఈటల భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి.ఈ విషయంలో కేంద్రంతో చర్చలు కూడా జరిపిన ఈటల ఏరోజు కమళం కండువా కప్పుకుంటారు అనేది అధికారిక ప్రకటన వెలువడ లేదు.
అయితే ఈటల బీజేపీలో చేరడం పై మొదటి నుండి బీజేపీ మరో నేత పెద్దిరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపధ్యంలో పెద్దిరెడ్డిని బుజ్జగించడానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రంగంలోకి దిగి ఆయన అనుమానాలకు సమాధానం చెప్పినట్లుగా ప్రచారం.
అంతే కాకుండా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా పెద్దిరెడ్డి ఇంటికి వెళ్లారట.మొత్తానికి ఈటల వ్యవహారంలో పార్టీ నేతలు పెద్ది రెడ్డిని బుజ్జగించే పనిలో పడ్డారు.
మరి పెద్దిరెడ్డి నిర్ణయం ఏంటో.?
.